అది ఏడో వింత: వైయస్ విజయమ్మపై ఈనాడు ధ్వజం

రామోజీరావుకు, మరికొందరికి లబ్ధి చేకూర్చడానికే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్లో ఏర్పాటు చేశారన్న వైయస్సార్ కాంగ్రెసు నేతల వాదనను తప్పు పట్టింది. ఈ అంశంపై విజయమ్మ భర్త దివంగత వైయస్ జరిపించిన సిబిఐ విచారణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిగ్గు తేలిందని, అయితే ఆ నివేదిక వైయస్ హయాంలో వెలుగు చూడలేదన్నారు. ఇప్పటి దాకా ఇది రాష్ట్ర ప్రజల దృష్టికి రాలేదన్నారు. వైయస్ ఏ అంశంపై విచారణ జరిపించారో, అదే అంశంపై అదే విచారణ సంస్థతో దర్యాఫ్తు జరిపించాలని వైయస్ విజయమ్మ హైకోర్టును ఆశ్రయించడం ప్రపంచంలో ఏడో వింత అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం బహిరంగ ప్రకటన అయిన మూడేళ్ల తర్వాత రామోజీ పాలమాకులలో మైహోమ్స్ సంస్థల నుంచి భూములు కొన్నారని ఆ లెక్కన విమానాశ్రయ ఏర్పాటు దృష్టితో ముందుగానే భూములు కొన్నారన్న ఆరోపణల్లో పస లేదన్నారు.












Click it and Unblock the Notifications