కీలక సూత్రధారి కెవిపి: గనుల లీజుపై తపాల్ శ్యాంప్రసాద్

తాను చెబుతున్నదానిపై కాణిపాకం దేవస్థానంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. లీజుల్లో అక్రమాలపై 2006లో రాజగోపాల్పైనా, ఆయన బావమరిదిపైనా అనంతపురం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, కేవీపీ పలుకుబడితో తన కేసును పోలీసులు నమోదు చేసుకోలేదని తెలిపారు. తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు వేస్తే 155 (3) కింద కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా మెజిస్ట్రేట్ వన్టౌన్ పోలీసులను ఆదేశించారని తెలిపారు. అలాగే, తన లీజు దరఖాస్తుకు సంబంధించి న్యాయం చేయాల్సిందిగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కోరగా వారం తర్వాత రమ్మన్నారని, సర్వే నెంబర్ 1, 2 మల్కనగుడి ప్రాంతానికి నోటిఫై చేసి వేరే చోట ఇచ్చారని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి గెలిచానన్నారు. కోర్టులో గెలిచినా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆవేదన వెలిబుచ్చారు. గాలి ఆరెస్టుకు ముందు తాను మూడుసార్లు సీబీఐ వద్దకు వెళ్లి సాక్ష్యం చెప్పానన్నారు.












Click it and Unblock the Notifications