చిరంజీవిని బుజ్జగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేసేలా చూడాలని ఆయన చిరంజీవిని అభ్యర్థించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుడు కన్నబాబును పిలిపించుకుని మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యుల సంఖ్య ఓ వైపు కలవరానికి గురి చేస్తుండగా, మరో వైపు చిరంజీవి కొత్త చిచ్చును రాజేశారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల్లో నెలకొన్న అసంతృప్తిని వైయస్ జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వానికి గ్యారంటీగా కష్టకాలం వచ్చినట్లే.












Click it and Unblock the Notifications