Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెరాస నేత చెరుకు సుధాకర్‌కు ఏడాది పాటు నిర్బంధం

Telangana Logo
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌కు ప్రభుత్వం నిర్బంధం విధించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, ఉద్యమం సమయంలో హింసకు పాల్పడ్డారని పోలీసులు ఆయనను 'జాతీయ భద్రతా చట్టం' (నాసా) కింద అరెస్టు చేయడాన్ని ప్రభుత్వ కమిటీ సమర్థించింది. ఆయనను ఏడాదిపాటు నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. చెరుకు సుధాకర్ గతంలో విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పని చేశారు. నక్సలైట్ ఉద్యమంలోనూ కొంతకాలం ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో క్లినిక్ నడుపుతున్నారు. తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇటీవల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బస్సులపై దాడులు, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంతోపాటు ఆయనపై సుమారు 18 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుధాకర్‌పై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు నాసా కింద కేసు పెట్టారు. ఇటీవల బంద్‌లు, ఇతర ఆందోళన కార్యక్రమాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు.

నాసా కింద ఎవరినైనా నిర్బంధిస్తే రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పనిచేసే సలహా మండలి దీనిని ద్రువీకరించాల్సి ఉంటుంది. సుధాకర్‌ను విడుదల చేయాలంటూ ఆయన సోదరుడు డాక్టర్ విజయబాబు, కుమారుడు సహస్, భార్య లక్ష్మిబాయి, సోదరి వసంత పిటిషన్లు కూడా వేశారు. దీనిపై సీఎస్ పంకజ్ ద్వివేదీతోపాటు జస్టిస్ టీఎల్ఎన్‌రెడ్డి, మరో ఇద్దరు సభ్యులతో కూడిన సలహా మండలి సోమవారం సమావేశమైంది. చెరుకు సుధాకర్ నిర్బంధంపై విస్తృతంగా చర్చించింది. ఆయనపై పోలీసులు చేసిన అభియోగాలతో ఏకీభవించింది. ఆయన నేరపూరిత చర్యలకు దిగే అవకాశాలున్నాయని, ఫలితంగా సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సలహా మండలి తేల్చి చెప్పింది. "చెరుకు సుధాకర్ సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు. ఆయనను ఏడాది పాటు నిర్బంధంలో ఉంచాలి'' అని సలహా కమిటీ పేర్కొంది. ప్రభుత్వానికి దీనిపై సూచనలు చేసింది. మంగళవారం మొహర్రం సందర్భంగా సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వం ఆగమేఘాల మీద చెరుకు సుధాకర్ నిర్బంధంపై ఉత్తర్వులు జారీ చేసింది. జీవో విడుదల నాటి నుంచి సుధాకర్‌ను ఏడాది పాటు వరంగల్ సెంట్రల్ జైల్లోనే ఉంచుతారు.

టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అక్రమ నిర్బంధాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖండించారు. ఇందుకు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ పేరిట టీఆర్ఎస్ కార్యాలయం మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+