చరిత్రహీనుడు: చిరంజీవిని కడిగి పారేసిన వాసిరెడ్డి పద్మ

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీ పొందడానికి బేరసారాలు సాగించి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించి ఉండే వారని, పదవిని కాపాడుకోవడంలో మునిగితేలుతున్న కిరణ్కు ఎలాగూ తీరిక లేదని కనీసం చిరు అయినా సోనియాతో మాట్లాడి రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిస్తే బావుండేదన్నారు. ఆయన మంత్రి పదవుల కోసం తాపత్రయ పడ్డారని విమర్శించారు. ప్రజల విశిష్ఠ ఆదరణ పొంది ఇప్పుడు ప్రజలకు ఏమీ చేయలకపోవడం విశేషం. పిఆర్పీని విలీనం చేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి పునీతమైనట్లుగా భావించడం సరికాదన్నారు. శోభా నాగి రెడ్డిపై అనర్హత నోటీసు ఇచ్చే
అధికారం చిరుకు లేదన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలలో ఘన విజయం సాధిస్తారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎవరు రాజకీయ విలువలు దిగజార్చారో, ఎవరు ప్రలోభ పెట్టారో అందరికీ తెలుసునని సిఎంను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications