ఈడి నుండి జగన్కు పిలుపు, 20న హాజరు?

అయితే ఆయన పార్లమెంటు సమావేశాలకు మాత్రమే కాకుండా ఈడి 20వ తేదిన ఈడి ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరు పేరుతో జగన్ ఈడి ముందు హాజరయ్యేందుకే ప్రత్యేకంగా వెళుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా జగన్ గ్రూపు సంస్థలలోకి విదేశీ పెట్టుబడులు వచ్చిన వైనంపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఈడి, నవంబర్ 22లోగా తమవద్దకు వచ్చి వివరాలివ్వాలని లేదా ఎవరైనా ప్రతినిధితో వివరాలు, పత్రాలు పంపాలని నవంబర్ మొదటి వారంలో జగన్ను ఆదేశించింది. దీంతో విజయ సాయిరెడ్డి ఇప్పటికి నాలుగుసార్లు ఈడి ఎదుట హాజరై వివరణతో పాటు పలు పత్రాలను అందజేశారు. కానీ ఆయన వివరణతో ఈడి సంతృప్తి చెందనట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications