శబరిమల సంప్రదాయాలకు ఆంధ్ర మహిళ భంగం

Sabarimala
శబరిమల: ఆలయం సంప్రదాయానికి, ఆచారాలకు భంగం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ శబరిమలకు చెందిన 18 పవిత్రమైన మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల సరస్వతి అనే మహిళ సోమవారం 18 మెట్లు ఎక్కి ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుంది. సోమవారం మధ్యాహ్న సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆమె స్వామికి పూజలు కూడా చేశారు. పది నుంచి 50 లోపు మధ్య వయస్సు మహిళలకు ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. సరస్వతి ప్రవేశించడంతో ఆలయాన్ని శుద్ధి చేయాల్సి వచ్చింది. అయితే, వాకింగ్ స్టిక్ ఉపయోగించడంతో సరస్వతిని వృద్ధ మహిళగా భావించి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పట్టించుకోలేదని అంటున్నారు.

సరస్వతి అనే మహిళ 18 మెట్లను కడిగి ప్రధాన ఆలయాన్ని కూడా శుద్ధి చేసినట్లు ఆలయ యంత్రాంగం తెలిపింది. ప్రధాన పూజారి ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వివరించారు. సరస్వతి ప్రధాన ఆలయంలో పూజలు చేసుకుని, తర్వాత మల్లికాపురం ఉపాలయానికి వెళ్తుండగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆమెను గుర్తించారు. వారు ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే వాళ్లు కేసు ఏమీ నమోదు చేయకుండా పంపేశారు. తాను యుక్తవయసులో ఉండగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, స్వామి విగ్రహాన్ని ముట్టుకున్నట్లు కన్నడ నటి జయమాల 2006లో ప్రకటించి సంచలనం సృష్టించారు. దాంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు - నిరుడు కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేరళ హైకోర్టు గత సంవత్సరం అక్టోబర్‌లో స్టే విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+