వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స ఢిల్లీ రాజకీయం, కెవిపి రామచందర్ రావుతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో పలువురు నాయకులతో సమావేశమవుతూ బిజీగా గడిపారు. గత వారంలో ఐదురోజుల పాటు ఢిల్లీలో గడిపిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయన వారం తిరక్కముందే మళ్లీ ఢిల్లీలో ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి బొత్స ఢిల్లీ వచ్చారు. ఏఐసీసీ సీనియర్ నేత ఒకరితో ఆయన దాదాపు అరగంటకు పైగా లాబీలో చర్చలు జరిపారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ఈ సమావేశానికి సంధాన కర్తగా వ్యవహరించారు.

ఢిల్లీలో ఓ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన చిరంజీవితో ఓ హోటల్‌లో బొత్స చర్చలు జరిపారు. ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కూడా మంతనాలు జరిపారు. కెఎస్‌రావు, పనబాక లక్ష్మి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకటరెడ్డి తదితర ఎంపీలతో ఆయన డీసీసీల గురించి మాట్లాడారు. కాగా, బొత్సతో ఢిల్లీ వచ్చిన డీఎల్ రవీంద్రారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి తమ జిల్లాల సమస్యలపై అధికారులను కలిశారు.

English summary
PCC President Botsa Satyanarayana was busy in Delhi meeting leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X