హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కేసు, రాజగోపాల్ బెయిల్‌పై నిర్ణయం వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajagopal
హైదరాబాద్: గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి రాజగోపాల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై హైకోర్టు సోమవారం నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి. సిబిఐ పిటిషన్‌పై వాదోపవాదాలు పూర్తయ్యాయి. అయితే, నిర్ణయం కోసం హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రాజగోపాల్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. సాక్షులను ఇప్పటికే బెదిరించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని సిబిఐ చెప్పింది.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెవెన్యూ అధికారులు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు. అలాగే, ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు కూడా సిబిఐ ముందు హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు విచారణను సిబిఐ ముమ్మరం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విచారణ కూడా వేగంగా జరుగుతోంది.

English summary
High Court reserved its decision on Rajagopal bail in Gali Janardhan Reddy illegal mining case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X