బొత్స సత్తిబాబును కిరణ్ కుమార్ రెడ్డి కట్టడి చేస్తారా?

బొత్స సత్యనారాయణను కేవలం గాంధీభవన్కే పరిమితం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు ఆయన మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు చేసిన దాడులను, ఎసిబి ఇచ్చిన నివేదికను ఆయన బొత్స సత్యనారాయణను కట్టడి చేయడానికి వాడుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణకు మద్యం సిండికేట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కాస్తా ఆత్మరక్షణలో పడినట్లు చెబుతున్నారు. దీని నుంచి బయటపడడానికే ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
మద్యం సిండికేట్లతో సంబంధాలున్నవారి పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సంబంధాలు ఉండడం వల్లనే ఆ పేర్లను వెల్లడించడం లేదని కూడా సిపిఐ నేత నారాయణ లాంటి వారు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో బొత్స సత్యనారాయణకు కళ్లెం వేయడానికి ఎసిబి నివేదికను వాడుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications