వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బందిపోటులా ప్రభుత్వం పనిచేస్తోంది: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
విశాఖపట్నం: ప్రభుత్వం బందిపోటులా పనిచేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా మద్దెలపాలెంలోని ఆబ్కారీ కార్యాలయం వరకు నారాయణ ఆధ్వర్యంలో సిబిఐ కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా నారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) పట్టుకున్న మద్యం మాఫియా జాబితాను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల కుంభకోణాన్ని సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మద్యం సిండికేట్ల కుంభకోణంలో ముఖ్యమంత్రికి కిరణ్ కుమార్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. మంత్రులు కూడా ఇందులో పాలు పంచుకున్నారని, అందుకే మద్యం మాఫియా జాబితాను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో అధికారులు కూడా భాగస్వాములై దోచుకుంటున్నారని ఆయన అన్నారు. మద్యం మాఫియాపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఆయన హెచ్చరించారు. పదవిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. సమాంతర ప్రభుత్వాన్ని మద్యం మాఫియా ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు.

English summary
CPI state secretary K Narayana criticized that Government is working like decoit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X