స్పీకర్ నోటీసులకు జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు బేఖాతరు

స్పీకర్ సాక్షిగానే తాను పార్టీ విప్ను ధిక్కరించి తాను ఓటేశానని, అందువల్ల నోటీసుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలను జాప్యం చేసేందుకే స్పీకర్ తమను వివరణ కోరుతున్నారని ఆయన విమర్శించారు. మార్చిలోనే ఉప ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయాలని జగన్ ఆదేశించారు. జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్బంగా రేపు సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఫీజు రీయంబర్స్మెంట్ కోసం జనవరి 4వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణియించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారు.












Click it and Unblock the Notifications