తెలంగాణలో మూడు సీట్లపై కన్నేసిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 26వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెసు పార్టీ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరవుతారు. జిల్లాలోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. కొల్లాపూర్, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడింటిలో 2009 ఎన్నికల్లో కాంగ్రెసు కొల్లాపూర్లో విజయం సాధించింది. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. దీంతో దీనికి ఉప ఎన్నిక జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నాగర్ కర్నూలుకు, శాసనసభ్యుడు రాజేశ్వరరెడ్డి అకస్మిక మృతితో మహబూబ్నగర్కు ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. అన్ని స్థానాలకు పోటీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు.
ఈ నెల 26వ తేదీన జరిగే సమావేశంలో టికెట్ అశిస్తున్న నాయకుల విజయావకాశాలను, సర్వేల ద్వారా అందిన సమాచారాన్ని బేరీజు వేయనున్నట్లు తెలుస్తోంది. చివరి బంతి వేసే వరకు మ్యాచ్ అయిపోయినట్లు భావించకూడదని ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు ఇప్పటికే చెబుతున్నారని సామాచారం. ప్రత్యర్థుల కన్నా దూకుడుగా వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications