హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి బెయిల్ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. గాలి బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు పూర్తైన అనంతరం తీర్పును వాయిదా వేసింది. అంతకుముందు సిబిఐ తరఫు న్యాయవాది, గాలికి బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని వాదించారు. గాలి కేసు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉందని అలాంటప్పుడు బెయిల్ కుదరదన్నారు. అలీబ్ ఖాన్ అనే వ్యక్తిని పట్టుకోవాల్సి ఉందని అతనిని పట్టుకుంటే కీలక సమాచారం తెలుస్తుందన్నారు. అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కేసు నమోదు చేసిందని దేశంలో ఎక్కడైనా దర్యాఫ్తు చేసే హక్కు సిబిఐకి ఉందన్నారు.

అందుకు గాలి తరఫు న్యాయవాది, నిజంగా సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటే వారి సమీప పోలీసు స్టేషన్‌లలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేవలం సిబిఐకే ఎందుకు లేఖలు రాస్తున్నారన్నారు. గన్ మెన్ రక్షణ పొందడానికి గాలి కేసును ఆయుధంగా వాడుకుంటున్నారన్నారు. సిబిఐ కూడా బెయిల్‌ను వ్యతిరేకించడానికి ఇలాంటి లేఖలను ఆయుధాలుగా వాడుకుంటుందన్నారు.

English summary
CBI special court adjourned Gali Janardhan Reddy bail petition to 28th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X