వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరికి బెయిలిస్తే భానును పట్టుకోవడం కష్టం: సిఐడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితులు మన్మోహన్ సింగ్, బోయ వెంకట హరిబాబులకు బెయిల్ ఇస్తే ప్రధాని నిందితుడు భాను కిరణ్‌ను పట్టుకోవడం కష్టమని సిఐడి మంగళవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో వాదించింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని వారు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తన నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. వీరిద్దిరికి బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ కోర్టును కోరింది. వీరిద్దరిలో మన్మోహన్ సింగ్ భాను కిరణ్ గన్‌మన్‌గా పనిచేశాడు.

సూరి హత్యకు ఆయుధం సమకూర్చింది వీరిద్దరేనని సిఐడి వాదించింది. భాను కిరణ్ సన్నిహితుడు సుబ్బయ్యతో కలిసి సూరి హత్యకు కుట్ర పన్నారని ఆరోపించింది. వారికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని చెప్పింది. సూరిని హత్య చేసిన తర్వాత భాను పారిపోవడానికి సహకారం అందించింది కూడా వీరిద్దరేనని అన్నది. వ్యక్తిగత రక్షణ కోసం ఇచ్చిన ఆయుధాన్ని హత్యకు వాడారని ఆరోపించింది.

English summary
CID has opposed bail to accused in Maddelachervu murder case, Manmoahn Singh and Haribabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X