వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వల్లే 600 ఆత్మహత్యలు: శ్రీకాంతాచారి తల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏనాడైనా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల కుటుంబాన్ని పరామర్శించారా అని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మంగళవారం ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో ఆరువందల మంది బలిదానాలు చేశారన్నారు. టిడిపి, కాంగ్రెసు వైఖరి వల్లే ఆత్మహత్యలు జరిగాయన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామన్న మోత్కుపల్లి నర్సింహులు దళిత ద్రోహి అని విమర్శించారు. రూ.20 లక్షల కారులో తిరిగే మోత్కుపల్లి దళిత దొర అన్నారు. శ్రీకాంతాచారి పేరు ఎత్తే అర్హత అతనికి లేదన్నారు.

కాగా సోమవారం మోత్కుపల్లి మాట్లాడుతూ శ్రీకాంతాచారి, యాదయ్యలను చంపింది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను సహచర నేత ఎర్రబెల్లి దయాకర రావు కూడా మంగళవారం వరంగల్ జిల్లాలో ఖండించారు.

English summary
Srikanth Chary mother Shankaramma accused TDP chief Nara Chandrababu Naidu for Telangana suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X