చంద్రబాబు కరీంనగర్ జిల్లా పాదయాత్రలో ఉద్రిక్తత

చంద్రబాబును అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెరాస కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తెలంగాణ జెఎసి కార్యకర్తలు కూడా చంద్రబాబును అడ్డుకోవాడనికి ప్రయత్నించారు. ఈ సమయంలో నలుగురు గాయపడ్డారు. చంద్రబాబు యాత్రకు ఆటంకం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తెరాస నాయకులు నారదాసు లక్ష్మణరావు, కెప్టెన్ లక్ష్మీకాంత రావు వంటివారిని గృహనిర్బంధం చేశారు. కొన్ని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. అంతకు ముందు రెండు గ్రామాల్లో తిరిగిన చంద్రబాబుకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాలేదు. ముల్కనూరు రాగానే ఒక్కసారిగా తెలంగాణవాదులు ముందుకు వచ్చి చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications