అన్నా హజారే మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభం
అన్నా హజారే వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. అన్నా ఆరోగ్యం బాగా లేదని కిరణ్ బేడీ కూడా చెప్పారు. తన జట్టు సభ్యులు అర్వింద్ కేజ్రీవాల్, కిరణ్ బేటీ, మనీష్ సిసోడియాలతో కలిసి ఆయన మైదానంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై, వందేమాతరం వంటి నినాదాలు మిన్నంటాయి. వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేసి అన్నా తన దీక్షను ప్రారంభించారు. కాగా, అన్నా దారిలో హై డ్రామా చోటు చేసుకుంది. ఓ 20 మంది ఆయన వాహనానికి అడ్డుగా వచ్చి నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసారు. అన్నా హజారే ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఇదిలా ఉంటే చర్కా మీద పనిచేస్తూ ఘజియాబాద్కు చెందిన 79 ఏళ్ల గోపాల్ రాయ్ కింద కూర్చున్నారు. తన పదేళ్ల వయస్సు నుంచి చర్కాను తాను వదిలిపెట్టలేదని ఆయన చెప్పారు. అయితే, న్యూఢిల్లీలో అన్నా దీక్ష కన్నా ఇక్కడి దీక్ష ప్రజల హాజరు తక్కువగా ఉంది. వీధి నాటకాల ప్రదర్శన జరిగింది. పటిష్టమైన జన లోక్పాల్ అవసరాన్ని ప్రశాంత్ భూషణ్ వివరించారు.