వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉపఎన్నికలపై జగన్: నో కామెంటన్న సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

kiran kumar reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రకటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం స్పందించేందుకు నిరాకరించారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తుందని అందుకే తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామని రెండు రోజుల క్రితం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దీనికి ఆయన ఆయన పార్టీ ఆయన ఇష్టమని, దీనిపై నో కామెంట్ అన్నారు.

కాగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన కల్తీసారా ఘటన బాధితులకు తక్షణ సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయన క్యాంపు ఆఫీసులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. పలువురు మంత్రులు, నేతలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి వర్గం పదవులు, తెలంగాణలోని ఉప ఎన్నికలపై స్పందించిన విషయం తెలిసిందే.

English summary
CM Kiran Kumar Reddy did not like to comment on YS Jaganmohan Reddy's Telangana by poll statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X