వైయస్ జగన్ ఆదేశాలతోనే ఓటు వేశాం: శోభా నాగి రెడ్డి

sobha nagi reddy
కర్నూలు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే తాము అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌కు వ్యతిరేకంగా ఓటేశామని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి శనివారం అన్నారు. రైతుల కోసమే తాము పదవులను త్యాగం చేశామన్నారు. ప్రస్తుత కాంగ్రెసు పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు.

తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించిన వైయస్సార్ కాంగ్రెసు బాటలో చంద్రబాబు నడవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు సవాల్ చేశారు. అలా కాదని పోటీ చేస్తే టిడిపి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. గత ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయన్నారు. చంద్రబాబుకు నీచ రాజకీయాలు తప్ప నిజాయితీతో వ్యవహరించడం తెలియదని గట్టు రామచంద్రా రావు ధ్వజమెత్తారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తే బాబు ఏనాడో కరుమరుగయ్యే వాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+