జగన్ కేసులో పెద్దలు బయటే ఉన్నారు: శంకరరావు

P Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కొందరు పెద్దలు బయటే ఉన్నారని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు మందళవారం అన్నారు. విచారణ ఆలస్యం కావడం వల్ల వారు బయట ఉన్నారని, దీనిని వేగవంతం చేయాలన్నారు. జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డితో లాభం పొందిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాయిరెడ్డి అరెస్టు ఓ భాగం మాత్రమేనన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. కాగా తనపై దాడి జరిగిన ఘటనపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. 1588 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే దాదాపు వెయ్యి అన్యాక్రాంతమయ్యాయన్నారు. గతంలోని ప్రజాప్రతినిధులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళతానన్నారు. అనర్హుల ఇళ్లను తీసుకొని పేదలకు పంచిపెడతానన్నారు. వెయ్యి ఇళ్లను బిచ్చగాళ్లు, అనాథలు, రిక్షా కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన చేనేత శాఖకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను తన చాంబర్‌లో ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+