సాయిరెడ్డి చిత్రగుప్తుడే, వెనక యమదొంగ:జగన్పై ఆనం

ప్రజాధనాన్ని దోచుకునే అక్రమార్కులు ఎప్పటికైనా జైలుకెళ్లడం తప్పదని, జగన్ అక్రమాస్తుల కేసులో సాయి రెడ్డిని సిబిఐ అన్ని ఆధారాలతోనే అరెస్టు చేసిందని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఈ వ్యవహారంతో సంబంధం లేదని, జగనైనా మరెవరైనా అక్రమాలు చేస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనేక సిబిఐ దర్యాఫ్తులు జరిగాయని అప్పుడు మంచిదైన సిబిఐ ఇప్పుడు ఎలా చెడ్డదవుతుందని ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. స్వచ్ఛంగా ఉన్న వారే ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపాలని సూచించారు. ఉప ఎన్నికలకు, సాయి రెడ్డి అరెస్టుకు ముడి పెట్టవద్దన్నారు.












Click it and Unblock the Notifications