చిరు కార్పోరేటర్కు బొత్స బాసట: తిప్పికొట్టిన కిరణ్

డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి తన పార్టీకి చెందిన కార్పొరేటర్ నర్శింహయాదవ్కు ఇవ్వాలని సిఫారసు చేశారు. దానికి అంగీకరించిన బొత్స యాదవ్కు డిప్యూటీ ఇప్పిస్తానని చిరంజీవికి గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నాగేందర్, ముఖేష్, ఇతర నగర నాయకులతో మంతనాలు జరిపారు. చివరకు ముఖ్యమంత్రి కిరణ్ వద్దా తన మనోగతం వెల్లడించారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలివిగా వ్యవహరించారు. ఊసే లేని రాజ్కుమార్ను డిప్యూటీ మేయర్ పదవి రేసులోకి తీసుకుని వచ్చారు.












Click it and Unblock the Notifications