సిబిఐ విచారణ మీద కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన జగన్

YS Jagan
ఒంగోలు/హైదరాబాద్: తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు తనపై రాజకీయ కక్ష సాధిస్తోందన్నారు. పార్టీ వదిలి పెట్టాకనే తనపై సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెసు ఆలోచనలను సిబిఐ అమలు పరుస్తోందన్నారు. తనను నేరస్థుడిగా చూపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన సాక్షిలో పెట్టుబడులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.

ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో జగన్‌తో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, శాసనసభ్యుడు పిన్నెల్లి, మాజీ ఎమ్మెల్సీ రెహ్నాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఫీజు ధర్నా జరుగుతోంది. కొన్నిచోట్ల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీగా విద్యార్థులు తరలి వచ్చారు. అక్కడ రోడ్డు ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారిని బలవంతంగా వాహనం ఎక్కిస్తుండగా ఇద్దరు మహిళలు కింద పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+