జగన్కు కెసిఆర్ చేయి, కొండా సురేఖపై పోటీకి రెడీ

పరకాల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల విషయంలో జగన్ ప్రతిపాదనకు తెరాస అంగీకారం తెలిపే పరిస్థితే కనిపించింది. కానీ, తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తెరాస అధినేత కెసిఆర్ మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. దీంతో పరకాలలో కొండా సురేఖపై అభ్యర్థిని పోటకి దించుతామని కెసిఆర్ బుధవారం పల్లెబాట ఇంచార్జీల సమావేశంలో చెప్పారు. అలాగే, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా పోటీకి దిగుతామని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రకటించారు. దీన్ని బట్టి కెసిఆర్కు, వైయస్ జగన్కు మధ్య సయోధ్య బెడిసికొట్టినట్లు భావిస్తున్నారు. జగన్ను కూడా సమైక్యవాదిగానే భావిస్తామని తెరాస నాయకులు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. ఈ స్థితిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జగన్ తలపెట్టిన రైతు దీక్షపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications