హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఓ రాక్షసుడు: మోత్కుపల్లి తీవ్రమైన వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కెసిఆర్‌కు ఆయన పదిపేజీల బహిరంగ లేఖ రాశారు. అందులో కెసిఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల రక్తం తాగి కెసిఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సకల జనుల సమ్మెను సకల సంపదలుగా మార్చుకున్నారన్నారు. అమరవీరుల ఉసురు పోసుకుంటున్న రాక్షసుడన్నారు. బుడ్డిపేట నుండి వలస వచ్చిన చరిత్ర ఆయదన్నారు. ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేసి తెలంగాణ ఉద్యమానికి మచ్చ తెచ్చాడన్నారు.

కాంగ్రెసు పార్టీతో డీల్ కారణంగానే చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని టిఆర్ఎస్, జెఏసి చూస్తోందని కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. బాబు యాత్ర అడ్డుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో కెసిఆర్ ఎలా తిరుగుతారో చూస్తామన్నారు. బాబు యాత్ర అడ్డుకోమన్న వారికి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ఒకరిని ఒకరు అడ్డుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మనుగడ ఉండదని మరో నేత పెద్దిరెడ్డి అన్నారు. జెఏసి చైర్మన్ కోదండరామ్ బాబును అడ్డుకోవాలన్న ప్రకటనను ఉపసంహరించుకోవాలన్నారు. అడ్డుకోవాలని చూస్తే అడ్డు తొలగించుకునే శక్తి టిడిపి కార్యకర్తలకు ఉందన్నారు.

English summary
TDP leader Mothkupalli Narasimhulu lashes out at TRS chief K Chandrasekhar Rao for his attitude. He accused that KCR took fluids at the time of fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X