సిఎంను తప్పించండి: ఆజాద్కు ఫిర్యాదుల వెల్లువ

ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పని చేయడం కష్టమన్నారు. సిఎం పథకాలు ప్రవేశపెట్టే ముందు నాయకులతో మాట్లాడటం లేదని చెప్పారు. గతంలో పథకాలపై చర్చ జరిగినప్పుడు అందరితో మాట్లాడే వారని కాని కిరణ్ మాత్రం ఒక్కడే నిర్ణయం తీసుకుంటున్నారని, పత్రికల్లో వచ్చిన తర్వాతే నాయకులకు తెలుస్తోందని ఆజాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి సీట్లు కేటాయించడాన్ని కొందరు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణ అంశంపై వెంటనే తేల్చాలని పలువురు నేతలు ప్రాంతాలకతీతంగా ఆజాద్ ముందు మొరపెట్టుకున్నట్లుగా సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇలాగే సాగదీస్తే పార్టీకి నష్టమని వారు సూచించారు.












Click it and Unblock the Notifications