హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ యాకూబ్‌ మీద దాడి ఘటనపై సిబిఐ విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి యాకూబ్ రెడ్డిపై పోలీసుల దాడి ఘటనపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం సిబిఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ గులాం అహ్మద్, జస్టిస్ కెజి శంకర్‌తో కూడిన ధర్మాసనం మూడు నెలల్లో దాడికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సిబిఐని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా తమకు న్యాయం జరగకున్నా న్యాయస్థానం స్పందించి విచారణకు ఆదేశించడం పట్ల ఆనందంగా ఉందంటున్నారు. కాగా గతేడాది తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలో భాగంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిపై దాడి చేసిన సంఘటనలో యాకూబ్ రెడ్డి నిందితుడు.

ఇతనిని పోలీసులు ఆగస్టు 7వ తేదిన అరెస్టు చేశారు. అతనిని పోలీసులు పలు పోలీసు స్టేషన్లు తిప్పి దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో యాకూబ్ కిడ్నీ, కాళ్లూ పోగొట్టుకున్నాడు. దీనికి స్థానిక డిఎస్పీ కారణమని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణవాదులు పలుమార్లు డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదని కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం హర్షదాయకమన్నారు. నాలుగు నెలల క్రితం యాకూబ్ తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని హైకోర్టును ఆశ్రయించారు.

English summary
High Court ordered CBI probe in Yakub Reddy issue today. Police used third degree on him against attack on minister Ponnala Laxmaiah residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X