కెసిఆర్కు చెక్: అమర వీరుల ఐక్య వేదిక అభ్యర్థులు
శానససభా సభ్యత్వాలకు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరినవారే తిరిగి పోటీ చేసి గెలుస్తే వారు తెరాస శాసనసభ్యులవుతారే గానీ తెలంగాణకు ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు నుంచి నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేస్తే మద్దతిస్తామని, వేరేవారు పోటీకి దిగితే తాము పోటీకి దిగుతామని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పోటీకి దిగాలని ఇటీవల మరణించిన టి. రాజేశ్వర రెడ్డి సతీమణిని అడుగుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాదని, తమ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ సెగ ఢిల్లీకి తాకుతుందని ఆయన అన్నారు. తమపై పోటీకి దిగాలని ఆయన సమైక్యవాదులను కోరారు. సమైక్యవాదులు గెలిస్తే తాము తెలంగాణవాదాన్ని వదులుకుంటామని, తాము గెలిస్తే తెలంగాణ ఏర్పాటుకు సమైక్యవాదులు సహకరించాలని ఆయన అన్నారు.
Comments
English summary
Telangana martyrs' JAC has announced it candidates for Telangana bypolls.
Story first published: Saturday, January 7, 2012, 16:13 [IST]