వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ విచారణ: జగన్ బాటలో అంబటి, బాబుదే తప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu and YS Jagan
హైదరాబాద్: సిబిఐ ఎదుట తన ఆస్తుల కేసులో కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆచరించిన వ్యూహాన్నే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాటించారు. ఎమ్మార్ కేసు వ్యవహారంలో తప్పంతా టిడిపి అధినేత నారా చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన చెప్పారు. ఎమ్మార్ కేసులో సిబిఐ అధికారులు ఆదివారం అంబటి రాంబాబును విచారించారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం - ఎమ్మార్ అగ్రిమెంట్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పారు. అప్పటి జివోలపై విచారణ జరపమని సిబిఐని కోరినట్లు చెప్పారు. తనను సాక్షిగానే విచారించారని, జగన్ ఆస్తుల కేసులో తనను ప్రశ్నించలేదని చెప్పారు. సిబిఐ అడిగిన వివరాలు అందించానని, మళ్లీ ఎప్పుడు హాజరు కమ్మంటే అప్పుడు హాజరయ్యేందుకు సిద్ధమన్నారు.

బాబు హయాంలో జరిగిన ఒప్పందాలపై విచారణ జరపాల్సి ఉందన్నారు. ఎపిఐఐసితో సంబంధం లేకుండా ఎమ్మార్, ఎంఎఫ్‌జి ఒప్పందం జరిగిందన్నారు. నా హయాంలో జరిగిన పూర్తి వివరాలు సిబిఐకి అందించానన్నారు. ఎపిఐఐసి ఓ నోడల్ ఏజెన్సీ అని, దానికి పూర్తి అధికారాలు ఉండవన్నారు. ఎంజిఎఫ్ ఒప్పందం ముందు తనకు తెలియదని తర్వాతే తెలిసిందన్నారు. ఎపిఐఐసికి వాటా తగ్గడంలో తన పాత్ర లేదన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu followed party chief and MP YS Jaganmohan Reddy before CBI. He said Chandrababu make mistake in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X