సిఎంపై సోనియాకు ఐదుగురు మంత్రుల ఫిర్యాదు?

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెసు గ్రూపు తగాదాల సంస్కృతి మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని దించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఐదుగురు మంత్రులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఓ పత్రికలో వార్త వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారు ఆ లేఖ రాసినట్లు చెబుతున్నారు. ఈ ఐదుగురు మంత్రులకు మరో ఇద్దరు మంత్రులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై వరుస ఫిర్యాదులకు కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఐదుగురేసి మంత్రులు మొదట, ఆ తర్వాత శాసనసభ్యులు వరుసగా సోనియా గాంధీకి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు ఓ తెలుగు దినపత్రిక రాసింది. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులు కూడా అలాంటి లేఖలు రాస్తారని తెలుస్తోంది.

వైయస్ జగన్‌ను, తెలంగాణ అంశాన్ని ఎదుర్కునేందుకు ఎంతో నమ్మకంతో సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని, అయితే ప్రజలకు, పార్టీకి న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని మంత్రులు ఆ లేఖలో విమర్శించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చకపోతే పార్టీ మనుగడ కష్టమని కూడా వారు ఆ లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని వారు చెప్పారని సమాచారం. మంత్రి వర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి చిన్న తనంగా, తన స్థాయికి తక్కువగా భావిస్తున్నారని వారు ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాము పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు చెప్పామని వారు గుర్తు చేసినట్లు తెలుస్తోంది.

రెండు ప్రధానమైన పథకాలను మంత్రులకు కూడా చెప్పకుండా ప్రవేశపెట్టారని, తెలంగాణ అంశాన్నీ జగన్‌ను చూపి రోశయ్యను తప్పు పడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారని, ఆ రెండు అంశాల్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి కూడా విఫలమయ్యారని వారు వివరించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌ ఎదుర్కోవడం లేదని, సోనియాపైనా రాహుల్ గాంధీపైనా జగన్ విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి తగిన విధంగా స్పందించడం లేదని, పైగా జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు ఎక్కువ వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారని వారు చెప్పినట్లు సమాచారం. జగన్ వైపు ఐదారుగురు శానససభ్యులు మాత్రమే ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ 16 మంది అటు వెళ్లారని, వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని వారు చెప్పారు. జగన్‌పై హైకోర్టుకు లేఖ రాసిన మంత్రి పి. శంకరరావును అభినందించడానికి బదులు ముఖ్యమంత్రి మందలించారని వారు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తున్నారని, మంత్రులు, శాసనసభ్యులు చెప్పిన పనులు ఏవీ జరగడం లేదని, దీంతో శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలవడం కూడా మానేశారని వారు వివరించారు. మొత్తంమీద, కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలోనే ఐదుగురు మంత్రులు సోనియాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+