జగన్‌పై ఇందూరులో కోడిగుడ్లు, టొమాటలతో దాడి

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో మంగళవారం సాయంత్రం టొమాటోలు, కోడిగుడ్లతో దాడి చేశారు. జగన్ కాన్వాయ్‌పైకి కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. దాడి చేసినవారిలో మహిళలు కూడా ఉన్నారు. ఆర్మూర్ రైతు దీక్షకు వెళ్తూ జగన్ నిజామాబాద్ చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్‌లో జగన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నిజామాబాద్‌లో ఆయన రోడ్ షో కూడా నిర్వహించారు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు రోడ్డుపై అక్కడక్కడా టైర్లు కాల్చి వేశారు. అయినా, ఆయన ప్రయాణానికి పెద్దగా ఆటంకాలు కలగలేదు.

తెలంగాణపై వైయస్ జగన్ వైఖరి స్పష్టంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని జగన్ చెప్పారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే తాము తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను దించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పారని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో జగన్‌కు ఎనలేని ఆదరణ, స్వాగతం లభిస్తోందని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+