చంద్రబాబు సహా నేతల అరెస్టు: తోపులాట, ఉద్రిక్తత

అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం నాయకులను పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. చంద్రబాబు పాదయాత్రతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్ సౌధా వద్దకు వస్తే చంద్రబాబును నిలదీస్తామని తెలంగాణ ఉద్యోగులు అంతకు ముందు హెచ్చరించారు. తెలంగాణపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని వారు విమర్సించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి కూడా దిగారు.
పాదయాత్ర ప్రారంభించే ముందు చంద్రబాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని చెప్పి, మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు లేవని ఆయన అన్నారు. పెరిగిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications