కాంగ్రెసులో కొత్త బిచ్చగాడు చిరంజీవి: రోజా వ్యాఖ్య

Roja
నిజామాబాద్: కాంగ్రెసు చిరంజీవి కొత్త బిచ్చగాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని రోజా విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో వైయస్ జగన్ 48 గంటల దీక్ష చేపట్టిన సందర్భంగా శిబిరం నుంచి ప్రజలను ఉద్దేశించి ఆమె మంగళవారం సాయంత్రం ప్రసంగించారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డిది ప్రచారం ఎక్కువ పని తక్కువ అని ఆమె అన్నారు. దున్నపోతు మీద వర్ష కురిస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. చంద్రబాబు తన హయాంలో రైతులపై కేసులు పెట్టించారని ఆమె విమర్సించారు. రైతులకు వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని విధాలా సహాయంగా నిలిచారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ వైయస్ పాలన వస్తుందని ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. కాంగ్రెసులో ఎవరి గోల వారిదేనని ఆమె వ్యాఖ్యానించారు.

మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి అనుభవం లేదని రోజా అన్నారు. ఆర్మూరులో వైయస్ జగన్ దీక్ష 8 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన దీక్ష ప్రారంభించాల్సి ఉండగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఆర్మూర్ గోల్‌బండ్ల చౌరస్తాలో జగన్ పార్టీ పతాకను ఆవిష్కరించారు. తాను రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు పరిహారం సాధిస్తానని ఆయన చెప్పారు. జగన్ దీక్ష మూడు రోజుల పాటు సాగుతుంది. మునిపల్లి వద్ద ఆయన పసుపు పంటను పరిశీలించారు. వ్యవసాయ మంత్రి లేని రాష్ట్రం ఇది అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+