నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును చూసి నవ్వుకుంటున్నారు: జగన్ వర్గం ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

Mekapati Chandrasekhar Reddy
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు యాత్రలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై చంద్రబాబు పాదయాత్ర చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో జగన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శలను ఆయున తిప్పికొట్టారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసుకోవడం చంద్రబాబు నాయుడికే అలవాటు అని ఆయన అన్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులో జగన్ రైతు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన చెప్పారు. దీక్షకు హాజరవుతున్న రైతులను చూస్తుంటే తెలంగాణలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. దాంతో వారు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతు దీక్ష, జగన్ పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే ప్రజల కోరిక తీరుతుందని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party president YS Jagan camp MLA Mekapati Chandrasekhar Reddy lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X