పొలిటికల్ మెగా వార్: చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ

సామాజిక న్యాయం సాధిస్తానని చెప్పిన వ్యక్తి కాంగ్రెసులో పార్టీని విలీనం చేశారని బాలకృష్ణ కృష్ణా జిల్లా పర్యటనలో చిరంజీవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన చిరంజీవిని లక్ష్యం చేసుకున్నాడు. బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి అనూహ్యమైన రీతిలో మాట్లాడలేరు. గతంలోని మొహమాటాన్ని ఆయన వదిలేసినట్లు కనిపించారు. బాలకృష్ణ తనకు స్నేహితుడు అంటూనే బాలకృష్ణవి చిన్న పిల్లాడి మాటలని, చిన్న పిల్లాడి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ వ్యాఖ్యలపై మాట్లాడడం అనవసరమని చిరంజీవి పొలిటికల్ టచ్ ఇచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా మండిపడ్డారు.
చిరంజీవికి బాలకృష్ణపై మాట్లాడే నైతిక హక్కు లేదని తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదన్ అన్నారు. పదవి కోసం కాంగ్రెసు నాయకుల వద్ద చిరంజీవి మోకరిల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, చిరంజీవి మధ్య చోటు చేసుకున్న రాజకీయ వైరం, మాటల యుద్ధం భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications