వైయస్ జగన్‌కు, మీడియాకు ముఖ్యమంత్రి చురకలు

Kiran Kumar Reddy
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, మీడియాకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం చురకలు వేశారు. చంద్రబాబు రైతు పోరు బాట, జగన్ రైతు బాట రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. వారి రాజకీయ యాత్రలకు కాంగ్రెసు సమాధానం చెప్పగలదన్నారు. ఆయన మీడియా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీలో గొడవలు అంటూ కొన్ని పత్రికలు ఊహాజనిత వార్తలు రాస్తున్నాయన్నారు. కాంగ్రెసు క్రమంగా బలపడుతుందన్న అక్కసుతో కొన్ని పత్రికలు ఆలా చేస్తున్నాయని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తరణ తేదిని త్వరలో చెబుతామన్నారు.

ఉత్తరాంధ్రలో రూ.27 కోట్లతో పరిశ్రమల ఏర్పాటును చేస్తామన్నారు. పార్ట్‌నర్ షిప్ సమ్మిట్‌లో రూ.ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరిస్తామని చెప్పారు. 90 లక్షల మంది రైతులకు తమ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తోందన్నారు. కాగా అరకులో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉదయం హైదరాబాద్ నుండి విశాఖ చేరుకున్నారు. అయితే అక్కడ నుండి అరకు వెళ్లేందుకు సన్నద్ధమైన సమయంలో వాతావరణం అనుకూలించక పర్యటన రద్దయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+