నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దీక్షకు తెలంగాణ సెగ, లాఠీఛార్జ్: శిబిరం ముట్టడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో రైతుల కోసం దీక్ష చేస్తున్న జగన్ శిబిరంలోకి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యకర్తలు దూసుకు వచ్చారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు, తెలంగాణవాదులకు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సుమారు ముప్పై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా జగన్ పర్యటనపై తెలంగాణవాదులు, న్యూడెమోక్రసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులను ఖచ్చితంగా నిలదీస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జగన్ తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. జగన్ శిబిరాన్ని ముట్టడించినప్పుడు పోలీసులు దారుణంగా వ్యవహరించారని, అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy faced Telangana heat today. CPIML new democracy activists rounded Jagan's deeksha camp today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X