వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి కేబినెట్ తిప్పలు, అధిష్టానానికి ఫిర్యాదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం నేతల కేబినెంట్ పంచాయతీ ఢిల్లీకి తాకింది. కడప జిల్లా సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వవద్దంటూ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, కాంగ్రెసు నేతలు చెంగల్రాయుడు, అహ్మదుల్లాలు కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను గురువారం కలిసి కోరారు. సి.రామచంద్రయ్యకు పదవి ఇస్తే కడప జిల్లాలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని వారు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం ఒకటి గంటలకే డిఎల్ వచ్చి ఆజాద్‌కు ఫిర్యాదు చేస్తారనుకున్నప్పటికీ అప్పుడు రాలేదు. ఆ తర్వాత ముగ్గురు ముగ్గురు కలిసి వచ్చి ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.

తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన, అవిశ్వాస తీర్మానంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకున్న చిరంజీవి వర్గం నేతలకు అధిష్టానం రెండు పదవులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరు ఎవ్వరిని సూచిస్తే వారికి ఇవ్వడానికి అధిష్టానం ఓకె చెప్పింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్య పేర్లను చిరంజీవి సూచించారు. అయితే సి.రామచంద్రయ్యకు పదవి ఇవ్వడాన్ని మాత్రం జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జిల్లా ఎమ్మెల్యే వీర శివా రెడ్డి కూడా అదే చెప్పారు. చిరంజీవి వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాల్సిందేనని, అయితే రామచంద్రయ్యకు ఇస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పారు.

English summary
Tirupati MLA Chiranjeevi cabinet issue goes before high command today. Minister DL Ravindra Reddy, leaders chenglrayudu and ahmedulla ready to complaint against C.Ramachandraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X