వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ముమ్మాటికీ సమైక్యావాదే: ఎంపి వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

G Vivek
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి సమైక్యావాదేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, సీమాంధ్ర నేతలు పార్టీఅధిష్టానాన్ని తెలంగాణపై తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండమేనని ఆయన అన్నారు. తెలంగాణ కావాలా, వద్దా అనే విషయాన్ని ప్రజలు ఉప ఎన్నికల ద్వారా తేలుస్తారని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయకూడదని ఆయన అన్నారు.

పారిశ్రామికవేత్తలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన భాగస్వామ్య సదస్సు సీమాంధ్ర సదస్సుగానే జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్రనే ప్రమోట్ చేశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. భాగస్వామ్య సదస్సు వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

English summary
Congress Telangana MP G Vivek said that YSR Congress president YS Jagan is a supporter of United Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X