సిఎంను కలిసిన వైయస్ వివేకా,చిరంజీవి ఎమ్మెల్యే గీత
పునర్వ్యవస్థీకరణకు అనుమతివ్వాలని అధిష్టానాన్ని కోరేందుకు సిఎం వెళుతున్న సమయంలో వైయస్ వివేకా కలవడం విశేషం. కడప ఉప ఎన్నికలకు ముందు వివేకా వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఉప ఎన్నికల బరిలో వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేసేందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన శాసనమండలి సభ్యత్వం కూడా ముగిసింది. మరోవైపు సిఎంతో చిరంజీవి వర్గం ఎమ్మెల్యే వంగా గీత, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ, మంత్రులు బస్వరాజు సారయ్య, మహీధర్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, చీప్ విప్ కొండ్రు మురళి తదితరులు భేటీ అయ్యారు.
Comments
ys vivekananda reddy kiran kumar reddy congress ys jagan hyderabad వైయస్ వివేకానంద రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు వైయస్ జగన్ హైదరాబాద్
English summary
Former Minister YS Vivekananda Reddy, MLA Vishnuvardhan Reddy and Chiranjeevi camp mla Vanga Geetha met CM Kiran Kumar Reddy.
Story first published: Tuesday, January 17, 2012, 11:32 [IST]