హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇన్ఫో లేకుంటే ల్యాప్‌టాప్ తిరిగి ఇచ్చేస్తాం: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి ల్యాప్‌టాప్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులకు సంబంధించిన సమాచారం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చేస్తామని సిబిఐ తెలిపింది. విజయ సాయి రెడ్డి కార్యాలయంలో తాము స్వాధీనం చేసుకున్న సువర్ణ భూమి డెవలపర్స్ సంస్థ ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన సమాచారం లేకపోతే ల్యాబ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. విజయ సాయి రెడ్డి కార్యాలయంలో సిబిఐ స్వాధీనం చేసుకున్న తమ ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇప్పించాలని సువర్ణ భూమి సంస్థ ప్రతినిధి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆడిటింగ్ కోసం తమ ల్యాప్‌టాప్‌ను విజయ సాయి రెడ్డికి తమ ల్యాప్ టాప్ ఇచ్చామని, సిబిఐ సోదాలు చేసినప్పుడు తమ ల్యాప్ టాప్‌ను కూడా తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. కేసు తదుపరి విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

English summary
CBI said that the Suvarnabhoomi laptop will be returned after clarifying about the information on YS Jagan assets case,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X