హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్, విజయశాంతిది మన భాష కాదు: మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothukupalli Narasimhulu
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, విజయశాంతిలది మన భాష కాదని, మన ప్రాంతమూ కాదని తెలంగాణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం సూచించారు. కెసిఆర్‌ది నేర్చుకున్న భాష అని, సినిమాల్లో మాట్లాడే భాష అన్నారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మోసగాన్ని నమ్మి ఉప ఎన్నికల్లో ఓటు వేయవద్దన్నారు. కెసిఆర్ పోలవరం టెండర్ల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. హైకోర్టు వ్యాఖ్యలతో టెండర్లను తిరిగి తెచ్చుకునేందుకు కేంద్రమంత్రి ఆజాద్ దగ్గరకు ముఖ్యమంత్రితో రాజాంను పంపించారని ఆరోపించారు. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ముడుపులు తీసుకున్నారన్నారు. అందుకే ఆయన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడని ధ్వజమెత్తారు.

తెలంగాణ సాధన కంటే కెసిఆర్‌కు పోలవరం టెండర్లే ఎక్కువయ్యాయన్నారు. ఉద్యమం ముసుగులో సెంటిమెంట్‌ను అమ్ముకున్న వ్యాపారి కెసిఆర్ అన్నారు. కెసిఆర్ నాటకాలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఫాంహౌస్‌లో రెస్టు ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. కెసిఆర్ దొంగ తెలంగాణవాది అని, దోపిడీదారు అని, పదకొండేళ్లుగా ఉద్యమం పేరుతో ఏడువందల మంది విద్యార్థులను బలితీసుకొని కొండచిలువలా రక్తం తాగిన దుర్మార్గుడు అని ఫైర్ అయ్యారు. కెసిఆర్ ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు అన్నారు.

English summary
TRS mps K Chandrasekhar Rao and Vijayashanthi are not from Telangana, suggested TDP senior leader Mothkupalli Narasimhulu to Telangana people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X