కేబినెట్ నుండి శంకర రావు ఔట్? మల్లుకు అవకాశం
ప్రస్తుతమున్న మంత్రివర్గంలో తెలంగాణ వారి వాటా పదహారు. జూపల్లి, కోమటిరెడ్డిలు రాజీనామా చేయడంతో ప్రస్తుతం అది పద్నాలుగుగా ఉంది. శంకర రావును తప్పిస్తే తెలంగాణ నుండి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. గండ్ర వెంకట రమణా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో తెలంగాణ వాటా పూర్తి చేయాలని సిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు పిఆర్పీ నుండి చిరంజీవి సూచించిన సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు దాదాపు ఖరారైనట్లే. కాసు కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డిల పదవులకు కూడా ముప్పు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సిఎం కోరినట్లు పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తే తేనేతుట్టెని కదిపినట్లే అవుతుందని అందుకే పిఆర్పీ వర్గంతో పాటు మరో మూడు నాలుగుంటికే అధిష్టానం ఛాన్స్ ఇస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.