బొత్స పదవులపై నిర్ణయం సోనియాదే: టిజి వెంకటేష్

TG Venkatesh
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ జోడు పదవుల అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం అన్నారు. జోడు పదవుల అంశం విషయంలో కాంగ్రెసులో ఒక ఆనవాయితీ కొనసాగుతోందన్నారు. తర్వాతి నిర్ణయం మేడమ్‌దేనన్నారు. మార్పులు చేర్పులపై మీడియా ఊహించినట్లుగానే నేనూ ఊహిస్తున్నానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అనేది ఏ రాష్ట్రంలోనైనా ఉంటుందని, అదే తరహాలో ఇక్కడా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెద్దలను కలిశారన్నారు. మంత్రివర్గ విస్తరణపైనే కలిశారని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకరిద్దరిని తొలగించే అవకాశముంది, అంతకు మించి భారీగా మార్పులుండవని అభిప్రాయపడ్డారు.

చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు నిత్యం కాలు దువ్వుతున్నందున ఆయనపై వేటు పడే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. శాఖల మార్పులు అంత పెద్దగా ఉండకపోవచ్చునన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెసులో కలవడమో లేదా కాంగ్రెసు జిందాబాద్ అంటూ కలిసి పని చేయడమో చేయాలన్నారు. లేదంటే నీటి బుడగ మాదిరి అవుతుందన్నారు. కాంగ్రెసులో స్వాతంత్ర్యం ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఢిల్లీకి వచ్చారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+