ఆజాద్తో సిఎం భేటీ, అక్కడే నమస్తే తెలంగాణ రాజం

సిఎం, ఆజాద్తో చర్చలు జరుపుతున్న సమయంలోనే రాజం అదే ప్రాంగణంలో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదీ పోలవరం టెండర్లను ఉన్నత స్థాయి కమిటీ ఖరారు చేయబోతున్న నేపథ్యంలో ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో ముఖ్యమంత్రి, అధిష్టానం మధ్య చర్చలు మంత్రివర్గ విస్తరణకే పరిమితమయ్యాయా? లేక ఇతర అంశాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ రాజం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కాగా రాజంతో పాటు టెండర్ వేసిన మరో నేత కూడా పార్టీ పెద్దలతో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications