చిరంజీవి ప్రజారాజ్యం మనుగడలో లేదు: ఉండవల్లి

Undavalli Arun kumar
హైదరాబాద్: చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ మనుగడలో లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సరైందేనని ఆయన అన్నారు. ఆయన శుక్రవారంనాడు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీలో అందరికీ సమప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికలకు భయపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయడానికి భయపడుతున్నారనే మాటలో వాస్తవం లేదని, వారిపై చర్యలు తీసుకోవాల్సింది శానససభ స్పీకరేనని, ఆలోచన చేసి స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో ఆలోచించి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు హవా నడుస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+