నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బుల కోసమే పదవులు: చిరంజీవిపై చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నెల్లూరు: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో చేపట్టిన రైతు పోరు బాట కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సామాజిక న్యాయం పేరు చెప్పి పార్టీ పెట్టిన చిరంజీవి రెండు పదవులు తీసుకుని సామాజిక న్యాయం సాధించారా అని ఆయన అడిగారు. డబ్బుల కోసమే చిరంజీవి తన వర్గానికి చెందినవారికి పదవులు, ముఖ్యమైన శాఖలు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. చిరంజీవికి పనులు కావాలి, డబ్బులు కావాలి, వాటిని సాధించడానికి పదవులు కావాలని ఆయన అన్నారు. రాజకీయాలను చిరంజీవి వ్యాపారంగా చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు వైయస్ జగన్‌కు లక్షల కోట్లు దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. అడవి పందిలా రాష్టాన్ని దోచేశారని ఆయన ఆరోపించారు. అనర్హులను వైయస్సార్ అందలం ఎక్కించారని ఆయన అన్నారు. వైయస్సార్ నాయకులకు, అధికారులకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలు గొడ్డుబోయిన కాంగ్రెసు పార్టీకి పట్టం కట్టారని ఆయన అన్నారు. తమ పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు. తాము అధికారంలోకి వస్తే మత్స్య కారులకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా పార్టీ నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. వారికి ఆనయ క్లాస్ తీసుకున్నారు. పని చేయకపోతే ఎంతటివారైన సరే వారిని పక్కన పెడతామని ఆయన హెచ్చరించారు. పార్టీని ఫణంగా పెడుతున్నారని, అటువంటి వారికి టికెట్లు ఇచ్చేది లేదని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu naidu has lashed out at Congress MLA mega star Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X