డిడిఆర్సీలో దేవినేని వర్సెస్ జోగి, నాని:పోర్ట్పై రసాభాస

పోర్టు నిర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో మీడియాను అనుమతించాలని టిడిపి నేతలు డిమాండ్ చేయగా మీడియా లోపలకు వస్తే తాము బయటకు వెళతామని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావురి సాంబశివ రావులు చెప్పారు. మరో ఎమ్మెల్యే కూడా ఎంపీలకు మద్దతుగా నిలిచారు. టిడిపి నేతలు దీనిని ఖండించారు. ఎంపీల వైఖరిని నిరసిస్తూ వారు సమావేశాన్ని బహిష్కరించారు.
మరోవైపు విశాఖపట్నం జివిఎంసి సమావేశం కూడా రసాభాసగా మారింది. ఆస్తి పన్ను పెంపుపై తెలుగుదేశం, సిపిఎం పార్టీలు అధికార పార్టీని నిలదీశాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్తి పన్ను పెంపకంలో స్పష్టత లేదని, ప్రజలు అయోమయంలో ఉన్నారని, ఇందుకు జవాబు చెప్పవలసిన బాధ్యత కొన్సిల్ పైన ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రవిరాజు అన్నారు. ఆస్తి పన్ను తగ్గించాలంటూ సిపిఎం సభ్యులు మేయర్ను నిలదీశారు.












Click it and Unblock the Notifications