వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్‌లో ఆంధ్రా బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Bangalore
బెంగళూరు: బెంగళూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. జితేంద్ర అనే బిటెక్ విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం బెంగళూర్‌లోని అమృత ఇంజినీరింగ్ కాలేజీ వసతిగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవాడు. జితేంద్ర అమృతా ఇంజనీరింగ్ కాలేజీ బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన హాస్టల్ గదిలో అతను ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు.

హాస్టల్ వార్డెన్ రెచ్చగొట్టడం వల్లనే జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తమ తోటి విద్యార్థి ఆత్మహత్యతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మాటలతో రెచ్చగొట్టి జితేంద్రను వార్డెన్ ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపిస్తున్నారు. వార్డెన్ తదితరులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జితేంద్రను హాస్టల్ వార్డెన్‌ తీవ్రంగా వేధించాడని చెబుతున్నారు. కళాశాలలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.

English summary
An Andhra Student has committed suicide in Bangalore Amrutha engineering college hostel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X